మన్యం టీవీ, ఏటూరి నాగారం (ములుగు):
ఈరోజు ములుగు మండలం పోట్ల పూర్ గ్రామపంచాయతీ పరిధిలో కోవిడ్ బాధితులను ఎంపీటీసీ నునవాత్ మహేష్ ఆధ్వర్యంలో వారి ఇండ్ల దగ్గరకు వెళ్లి ములుగు నియోజకవర్గ సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్ నిత్యవసర సరుకులు అందజేశారు.
ఇటీవల మరణించిన పోరిక జానకి రాం కుటుంబాన్ని
తెరాస శ్రేణులు పరామర్శించారు.
ఈ సందర్భంగా పోరిక గోవింద్ నాయక్ మాట్లాడుతూ..
మస్కులు,భౌతిక దూరం అందరూ పాటించాలి.
కోవిడ్ వచ్చిన వారికి అండగా బియ్యం,సరుకులు అందజేయ్యడం జరుగుతుందన్నారు.
ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత కు ప్రాధాన్యం ఇవ్వాలని, మన ఆరోగ్యంమన కుటుంబానికి రక్షణ కవచం అని అన్నారు.
ఈకార్యక్రమంలో ఎక్స్ ఎంపీపీ బానోత్ మురళి,శ్యాముల్ నాయక్,గ్రామ పార్టీ నాయకులు, తెరాస శ్రేణులు పాల్గొన్నారు.
Post A Comment: