అశ్వాపురం మండలం తుమ్మలచెరువు, వెంకటాపురం గ్రామల మధ్య రవాణాకు అంతరాయం
మన్యం టివి అశ్వాపురం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం తుమ్మలచెరువు, వెంకటాపురం గ్రామల మధ్యా ఉన్నటువంటి వాగు భారీ వర్షాలకు పొంగి పోర్లుతుంది.దీనితో గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే కరోనా తో ఇబ్బంది పడుతున్న ప్రజలు, అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ కు వెళ్ళడానికి కూడా అవకాశం లేదని భయపడుతున్నారు.అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Post A Comment: