మన్యం టీవీ కొత్తగూడెం:- జూన్ 27
తెలంగాణా ప్రభుత్వం ప్రజలందరికి కొత్త ఇంటి నెంబర్ సేల్స్ అస్సేస్మంట్ పద్ధతి ద్వార ఏదైనా
నెట్ సెంటర్/ మీ సేవ సెంటర్ ల నుండి పొందుటకు అవకాశం కల్పించింది. ఇట్టి ఇంటి
నెంబర్ పొందటానికి రిజిస్టర్డ్ డాకుమెంట్స్ వున్న వారు పేరు మీద, సాధారణ డాకుమెంట్స్
వున్న వారు పేరు లేకుండా అనగా ప్రాంగణం హోల్డర్ గా నెంబర్ పొందవలసి వుంటుంది.
మరియు సరి అయిన డాకుమెంట్స్ / సరి అయిన ఇంటి కొలతలు ఆన్ లైన్ నందు అప్లోడ్ చెయ్యవలసి ఉంటుది. అలా కాకుండా, తప్పుడు ధ్రువ పత్రాలు, తప్పుడు ఇంటి కొలతలు
ఆన్ లైన్ నందు పొందుపరచి ఇంటి నెంబర్ పొందినవారిపై తెలంగాణా మునిసిపల్ చట్టం
2019, సెక్షన్ 94(3) ప్రకారం వారికి విధించబడిన ఇంటి పన్నుకు 25 రెట్లు ఏకకాల జరిమానా విధించి వసూలు చేయబడును. కావున ప్రజలు ఇంటి నెంబర్ ఆన్లైన్ పొందేటప్పుడు సరైన
సమాచారాము మాత్రమే ఇవ్వగలరని కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ నేడు ఒక ప్రకటనలో తెలియజేశారు.
Post A Comment: