మన్యం టీవీ కొత్తగూడెం:- జూన్ 27 ఆదివారం,
ప్రతి ఇంటి నుండి తీసుకున్న విదంగా లెక్క ప్రకారం ప్రతి ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేయాలని మొక్కలు పంపిణీ వివరాలు తప్పని సరిగా రిజిస్టర్ లో నమోదు చేయాలని చెప్పారు.
పల్లె ప్రగతి, హరితహారంపై శనివారం ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో తెలిపినందున కార్యక్రమాన్ని చేపట్టేందుకు గ్రామస్థాయి నుండి సన్నద్ధత కావాలని ఆయన స్పష్టం చేశారు. కమ్యూనిటీ, ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా అవెన్యూ, మల్టీ కలర్ మొక్కలు సిద్ధం చేయాలని చెప్పారు. జులై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభించాలని, నిర్దేశించిన విదంగా పనులు పెండింగ్లో ఉండడానికి వీల్లేదనని నూరు శాతం పనులు పూర్తి చేయు విదంగా అధికారులు కార్యోన్ముకులు కావాలని చెప్పారు. గ్రామాలు పట్టణాలు అభివృద్ధికి ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నదో ప్రతి ఒక్కరు గమనంలోకి తీసుకోవాలని చెప్పారు. గ్రామాలు, పట్టణాలలో ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇచ్చి నాటించాలని చెప్పారు. హరితహారం లో శాఖలు వారిగా మొక్కలు నాటేందుకు నిర్దేశించిన లక్ష్యాన్ని ఆయన ప్రకటించారు.
Post A Comment: