మన్యం టీవీ కొత్తగూడెం:- జూన్ 27
కొత్తగూడెం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రముఖ హోటల్లో రామవరానికి చెందిన జెర్రిపోతుల రాజేష్ కుమార్ నిన్న అనగా జూన్ 26న ఒక గదిని అద్దెకు తీసుకొని ఉంటూ నిన్న సాయంత్రం అట్టి గదికి తాళం వేసుకుని తన బంధువులతో కలిసి భద్రాచలం దేవాలయానికి దర్శనానికి వెళ్లి తిరిగి వచ్చి తమ వస్తువులను సరి చూసుకోగా 50000/-ల రూపాయల విలువ చేసే రెండు చెవి దిద్దులు కనపడకుండా పోవడంతో వెంటనే కొత్తగూడెం 3వ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినారు. ఫిర్యాదు అందుకున్న కొత్తగూడెం త్రీటౌన్ సీఐ వేణు చందర్ తన సిబ్బందితో కలిసి హోటల్ లో పనిచేసే వ్యక్తులను,రూమ్ బాయ్ లను విచారణ చేపట్టారు. హోటల్ గదికి తాళం వేసి భద్రాచలం దర్శనానికి వెళ్లి తిరిగి వచ్చేలోగా గది శుభ్రపరచటానికి వెళ్ళినట్లుగా మరొక తాళంతో ఆ గదిలోనికి వెళ్లి బండి రాజు అనే రూమ్ బాయ్ అక్కడ కనిపించిన చెవి దిద్దులను దొంగిలించినట్లుగా విచారణలో తేలిందని కొత్తగూడెం త్రీటౌన్ సీఐ వేణుచందర్ వెల్లడించారు. అనంతరం అతని వద్ద నుండి 50000/-ల రూపాయల విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకుని అట్టి వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా సిఐ వేణు చందర్ మాట్లాడుతూ కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటళ్లలో పని చేసే సిబ్బంది యొక్క వ్యవహారశైలిని వారి నడవడికను ఎప్పటికప్పుడు యాజమాన్యం గమనిస్తూ ఉండాలని సూచించారు.మరొకసారి తమ పరిధిలోని హోటల్లో పనిచేసే సిబ్బంది వలన వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా హోటల్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Post A Comment: