*వ్యవసాయ కూలీగా సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్.
మన్యం టీవీ ఏటూరు నాగారం
సెలవు దొరికితే చాలు చాలామంది ఇంటి వద్ద కుటుంబంతో సంతోషంగా గడపడానికి చూస్తున్న ఈ రోజుల్లో ఆదివారం సెలవు దొరికితే చాలు వ్యవసాయ కూలి గా మారి పోతారు. ములుగు, భూపాలపల్లి జిల్లా సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్ ఆదివారం సెలవు రోజు కావడంతో కూలి బాట పట్టారు. ములుగు జిల్లా రామచంద్రపురం గ్రామానికి చెందిన అరుణ శ్రీనివాస్ మొక్కజొన్న చేను లో కూలీలతో కలిసి మందులు చల్లారు. అనంతరం వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేసి కూలీలను ఉత్సాహపరిచారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు వ్యవసాయ పనులు చేస్తూ రైతులకు చేదోడు,వాదోడుగా నిలుస్తారు. ఒక జిల్లా ఆఫీసర్ తమతో కలిసి తమతో మమేకమై తమతో కలిసి పని చేయడంతో కూలీలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తస్లీమా మహ్మద్ సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలకు చేయూత అందిస్తున్నారు.ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ ట్రస్టు ద్వారా పేద కుటుంబాలను ఆదుకుంటున్నారు.
Post A Comment: