మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలం లోని సింగిరెడ్డి పల్లి పంచాయతీ లో గల మద్దుల గూడెం గ్రామంలో నివాసం ఏర్పరచుకున్న ఆదివాసీలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఏడూళ్ల బయ్యారం పోలీస్ శాఖ ఎల్ఈడి టీవీ అందజేయడం జరిగింది. ఏడూళ్ల బయ్యారం సీఐ దోమల రమేష్, ఎస్ ఐ టివిఆర్ సూరి మద్దుల గూడెం గ్రామంలోని ఆదివాసుల ప్రాంతానికి స్వయంగా వెళ్లి దగ్గరుండి ఎల్ఈడి టీవీ అందజేసి, టీవీ కొరకు ఒక ప్రత్యేక రూమును ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొద్దులగూడెం ఆదివాసీలకు పినపాక మండల ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి పల్లి పంచాయతీ సర్పంచ్ లక్ష్మి రూపవతి, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు, పోలీస్ కానిస్టేబుల్ లక్ష్మణ్, బొడ్డు హరిబాబు, ఎలకం గణేష్, సింగిరెడ్డి పల్లి పంచాయతీ ప్రజలు పాల్గొనడం జరిగింది
Post A Comment: