👉గుండాల ఐసోలేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అనుదీప్
👉 అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్
గుండాల ( మన్యం టీవీ) వసతులు పక్కాగా ఉండేలా చూడాలని కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం అధికారులకు తగు సూచనలను చేశారు. మండలంలో కరోనాతో ఇబ్బంది పడేవారికి సొంతంగా ఐసోలేషన్ లేనివారికి ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడనుంది. ఇప్పటివరకు కరోనా బారిన పడితే ఐసోలేషన్ లు ఉండాలంటే కొత్తగూడెం లేదా మణుగూరు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. కరోనా బారిన పడిన వారు ఐసోలేషన్ కి కొత్తగూడెం లేదా మణుగూరు వెళ్లాలంటే భయపడి ఇబ్బంది అయినా ఇంటి వద్దనే ఉండేవారు. అలా ఉంటూనే కొంతమందికి ఆక్సిజన్ అందక మృత్యువాత పడ్డారు. ఇప్పుడు ఆక్సిజన్ తో కూడిన ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో కరోనా రోగుల్లో మనోధైర్యం నింపి నట్లయింది. ఐసోలేషన్ కేంద్రంలో అన్ని వసతులు పక్కాగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులకు సూచించారు. అనంతరం ముక్తాపురం ముక్తి గుంపులో కరోనా బారిన పడిన వారు ఎక్కువగా ఉండడంతో కలెక్టర్ అనుదీప్ ఆ గ్రామాన్ని సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. శానిటేషన్ ప్రతిరోజు తప్పకుండా చేయాలని అన్నారు. గుండాల ప్రజా ప్రతినిధులు మటన్ లంక రహదారి ఇబ్బందిగా ఉందని గ్రామానికి వర్షాకాలం వెళ్లాలంటే నానా ఇబ్బందులు గురవుతున్నారని చెప్పడంతో కలెక్టర్ అనుదీప్ మటన్ లంక రహదారిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
Post A Comment: