మన్యంటీవీ,అశ్వారావుపేట:
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 250 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ అందజేసి నందుకు అశ్వారావుపేట లో తెరాస పార్టీ సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరావు అద్వర్యం లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేసిన టిఆర్ఎస్ నాయకులు. కరోనా తీవ్రతతో రోగులకు ఆక్సిజన్ కొరతను నివారించేందుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజలకు మరింత మెరుగైన చికిత్సను అందించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు రూ.2.5 కోట్ల రూపాయల విలువైన 250 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ అందుబాటులోకి తెచ్చి వారి గొప్ప మనసు చాటుకున్నారు. ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంట, పువ్వాడ ఫౌండేషన్- ఖమ్మం కలిసి సంయుక్తంగా రెండున్నర కోట్ల రూపాయల విలువైన 250 ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్ల ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ఇంత విలువైన పరికరాలను ఇచ్చినందుకు వారి ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేయడం జరిగిందనీ నాయకులు అభిమమానులు తెలిపారు.
ఇంత మంచి కార్యక్రమం చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జీవితాంతం రుణపడి ఉంటామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పార్టీ ప్రెసిడెంట్ ఉప్పల మురళి, ప్రసాద్, మారుతి వసంతరావు, శ్రీను, సత్యనారాయణ, హరిప్రసాద్, సతీష్, లోకం సాంబశివరావు, పొట్ట రాజులు, రామినేని సురేష్, బేతం రాము. అశ్వరావుపేట నియోజకవర్గ యువజన కన్వీనర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: