• ఉప్పతల ఏడుకొండలు
చంద్రుగొండ మన్యం టీవీ ప్రతినిది :
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చండ్రుగొండ టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఉప్పతల ఏడుకొండలు కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ తన ఇంటి వద్దనే జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కొరకు ఎంతోమంది బలిదానాలు చేస్తుంటే. ఇక ఈ బలిదానాలు ఆగాలంటే కెసిఆర్ చచ్చుడో తెలంగాణ ఓచ్చుడో అన్న నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉద్యమానికి రథసారధిగా మారి శాంతియుత వాతావరణంలో గాంధీ సూచించిన మార్గంలో ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రం సిద్దించడం లో ఎనలేని పాత్ర పోషించారని అన్నారు. ఈ సందర్భంగా అమరులైన తెలంగాణ ఉద్యమ వీరులకు శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
Post A Comment: