👉మున్సిపల్ చైర్.పర్సన్ కాపు సీతాలక్ష్మి
మన్యం టీవీ ,కొత్తగూడెం;
తెలంగాణ ఆవిర్బావ దినోత్సవము పురస్కరించుకొని కొత్తగూడెం పురపాలక సంఘ కార్యాలమునందు మున్సిపల్ చైర్.పర్సన్ కాపు సీతాలక్ష్మి ముఖ్య అతిధిగా విచ్చేసి జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగినది.
ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలముతో ఇప్పటి తెలంగాణ స్వరాష్ట్రమును సాధించుకోవడం జరిగినదని మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు మరియు స్ధానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఆలోచనలతో పలు అభివృద్ధి మరియు సంక్షేమ పధకాలు దిగ్విజయంగా కొనసాగుచున్నవని తెలిపారు.
ఇట్టి తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ కార్యక్రమములో వైస్ చైర్.పర్సన్ వేల్పుల దామోదర్, వార్డుల కౌన్సిలర్లు ధర్మరాజు,వేణుగోపాల్, ప్రసాద్, మరియు మున్సిపల్ కమిషనర్ ఏ.సంపత్ కుమార్, డిప్యూటి ఎక్స్ క్యూటివ్ ఇంజనీర్ నవిన్ కుమార్, కార్యాలయ మేనేజరు యల్.వి.సత్యనారాయణ, రెవెన్యూ ఇన్స్ స్పెక్టర్ ప్రసాద్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: