మన్యం టీవీ,బూర్గంపాడు:
మండల కేంద్రమైన బూర్గంపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతులకు సబ్సిడీపై సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు అధ్యక్షతన రైతులకు జిలుగు మరియు సాంబ విత్తనాలను బుధవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ రబి పంటలో వరి పంట అధిక దిగుబడులు సాధించిందని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు ఇచ్చే పంటలు సాగు చేసుకుంటే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు రైతుల పక్షాన ఉంటుందని అన్నారు. జిలుగు 30 కేజీ లు 561 రూపాయల 60 పైసలు అదేవిధంగా సాంబ బిపిటి 25 కేజీలు 807 రూపాయల యాభై పైసలు అని ప్రభుత్వమే సబ్సిడీ తో ఇస్తుందని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆధార్ కార్డు మరియు పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్ కార్యాలయం నందు అందజేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ కోవీడ్ నిబంధనలను పాటించి మాస్కు తప్పనిసరిగా ధరించాలి కోరారు. మధ్యాహ్నం 12 గంటల లోపు తీసుకోగలరని కోరారు. ఈ కార్యక్రమం లో డైరెక్టర్లు బత్తుల కొండారెడ్డి,బోడ గోపీనాథ్ బొల్లు రవి, సొసైటీ సీఈఓ ప్రసాద్, ఉమర్,తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.
Post A Comment: