బయో గ్రీన్ రెమిడీస్ ఆధ్వర్యం ముత్త పురం గ్రామంలో హెల్త్ క్యాంప్
గుండాల ( మన్యం టీవీ) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలోముత్త పురం గ్రామంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. బయో గ్రీన్ రెమిడీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సహకారంతో న్యూ డెమోక్రసీ అనుబంధ సంఘాలు ఏఐకెఎమ్ఎస్ ,పీ వై ఎల్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సహకారంతో ఈ హెల్త్ క్యాంపు ను నిర్వహించారు. మండలం పరిధిలోని ముత్త పురం గ్రామంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఈ హెల్త్ క్యాంపు నిర్వహించడంతో కొంతమేర కరోనా ఉదృతి దగ్గరే అవకాశం ఉందని గుండాల ఎంపీపీ సత్యం అన్నారు. గ్రామంలోని వందమంది రోగులకు మరియు కుటుంబ సభ్యులకు మోహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవునురి మధు మాట్లాడుతూ కరోనా విషయంలో భయపడాల్సిన అవసరం లేదన్నారు. చికిత్స తీసుకుంటే త్వరగా నయమవుతుందని ఆయన సూచించారు. కరోనా కారణంగా ప్రజలు నాన్న ఇబ్బందులకు గురవుతున్నారని ఆర్థికంగా చాలా నష్టపోయారన్నారు. కరోనా సోకిన ప్రతి ఒక్కరికి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కరోనా కారణంగా నిరుపేదలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని పనులు కూడా దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలు అయితే తినటానికి తిండి కూడా దొరకటం లేదన్నారు ప్రభుత్వం కరోనా బారినపడిన వారితో పాటు పేదలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి రామక డాక్టర్స్ రుబీనా , సిద్ధార్థ మన ఆస్పటల్ యాజమాన్యం బొగ్గరపు రాజు, సతీష్ ,నరసన్న ,ఉపేందర్ ,అశోక్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: