కరోనా కేసులు పెరుగుతుండడంతో నిర్ణయం తీసుకున్న సర్పంచ్ కొమరం శంకర్ బాబు
గుండాల ( మన్యం టీవీ) ఆళ్ల పల్లి మండలం పరిధిలోని మర్కోడు గ్రామం మూడు రోజులపాటు సంపూర్ణ లాక్ డౌన్ లో కి వెళ్లిపోతుంది 8 ,9,10 తారీకుల్లో లాక్ డౌన్ అమలవుతుందని సర్పంచ్ శంకర్ బాబు అన్నారు. మర్కోడు గ్రామంలో రోజురోజుకు కరోనా బారిన పడిన వారి సంఖ్య పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. మూడు రోజులపాటు పకడ్బందీగా లాక్ డౌన్ ను అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు వేరే గ్రామస్తులు ఎవరు మర్కోడు గ్రామానికి మూడు రోజులపాటు రావద్దని వారికి విజ్ఞప్తి చేశారు కరోనా కట్టడి కోసం గ్రామస్తులతో పాటు మిగతా వారు కూడా సహకరించాలని ఆయన కోరారు
Post A Comment: