టిఆర్ఎస్ కార్యకర్త కరోనాతో చికిత్స పొందుతూ చాట్ల సమ్మయ్య మృతి
;ప్రైవేటు వైద్యశాలలో ఎనిమిది లక్షల పైచిలుకు అయినా ఖర్చు
;భరించే స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుంటే సమ్మయ్య మృతి
గుండాల (మన్యం టీవీ) శంభుని గూడెం గ్రామంలో కరోనా మరణ మృదంగం చేస్తుంది. ఇప్పటికే కరోనాతో పలువురు చనిపోగా సోమవారం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త చాట్ల సమ్మయ్య ఖమ్మంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండో దశలో కరోనా ధాటికి శంభుని గూడెం గ్రామం విలవిలలాడుతోంది. చాట్ల సమ్మయ్య ఇరవై రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఖమ్మంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్సనందిస్తున్నారు. ఇప్పటికే ఆస్పత్రి బిల్లు ఎనిమిది లక్షల పైచిలుకు అయిందని సమాచారం. ఆయన సమ్మయ్య ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు రెంఢు రోజుల క్రితం తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ సోమవారం మృత్యువాత పడ్డాడు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టిన సమ్మయ్య బ్రతక పోవడంతో కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. శంబర గూడెం గ్రామం కరోనా కోరల్లో చిక్కుకున్న నాటినుండి మరణాల సంఖ్య రోజు రోజు పెరుగుతూనే ఉంది హెల్త్ క్యాంపులు నిర్వహించినప్పటికీ కరోనా కట్టడి కాకపోవడంతో గ్రామస్తులు భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటివరకు ఎక్కడో కరోనాతో చనిపోయారన్న వార్త విన్న గ్రామస్తులు ఇప్పుడు కుటుంబ సభ్యులు బంధువులు చనిపోవడంతో గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి
Post A Comment: