గుండాల ( మన్యం టీవీ) మండలం పరిధిలోని ముత్త పురం సబ్ సెంటర్ పరిధిలో దోమ తెరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు . గుండాల జెడ్ పి టి సి రామక్క, ఎంపీపీ ముక్తి సత్య, ముత్త పురం సర్పంచ్ పూనెం సమ్మయ్య చేతుల మీదుగా ముత్త పురం గ్రామంలో పంపిణీ చేశారు. మలేరియా ప్రభావిత గ్రామాల్లో ముందుగా దోమ తెరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి వివరాలు దోమకాటు వల్ల వస్తున్నందున ఈ దోమతెరలు వాడడంతో రాకుండా నివారించవచ్చు అన్నారు. దోమతెరలు అత్యంత ఖరీదైన వని మరియు నాణ్యమైనవి కూడా అన్నారు. ప్రజలు దోమ కాటు నుండి రక్షణ పొందాలంటే తప్పకుండా దోమ తెరలను నిత్యం వాడాలని కోరారు. దోమ తెరలను వేరే ఇతర వాటికి వాడకుండా దోమల దోమల నుండి రక్షణ కొరకు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ త్రివేణి,హెచ్ వి పద్మ , మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ సత్యం , ఏఎన్ఎం భువనేశ్వరి , అంగన్వాడి టీచర్ ఆశా వర్కర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: