మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో 13 మంది జర్నలిస్టు సోదరులకు నిత్యవసర సరుకులు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, టిపిసిసి కార్యదర్శి పైడాఆకుల అశోక్, సహకార సంఘం చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సీతారాం నాయక్, మాజీ మండల అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు లక్ష్మి జోగా నాయక్, భూక్య సుక్య, ముద్ద బోయిన రాము, జిల్లా నాయకులు పాలడుగు వెంకటకృష్ణ ఎంపీటీసీ లు ఏడుకొండలు, చాపల ఉమాదేవి, ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు భూక్యా రాజు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, జంపాల చంద్రశేఖర్, శ్రీకాంత్, తిరుపతి రెడ్డి, దేపాక కృష్ణ, వార్డు సభ్యులు లక్ష్మి గొంది కిరణ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: