మన్యం టీవీ, మణుగూరు:
మణుగూరు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మణుగూరు మండలం శివలింగపురం గ్రామంలో నివాసం ఉంటున్న ,పండు వెంకటేశ్వర్లు,అచ్చమ్మ దంపతులకు మరియు వారి మనవరాలు మధురిమ కు కరోనా పాజిటివ్ రావడం జరిగింది. రెక్కాడితే డొక్కాడని పరిస్థితి వారిది,బయటకి వెళ్ళలేని పరిస్థితి.వారు బాపనకుంట ఏసు క్రీస్తు కృపా ప్రార్థన మందిరంలో క్వారంటైన్ లో ఉన్నారు. వారి పరిస్థితి తెలుసుకున్న "ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ4 "వారు వెంటనే స్పందించి వారికి కి 25 కేజీల బియ్యం నిత్యవసర వస్తువులు మరియు కూరగాయలు బాధితులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గుగులోత్ రాందాస్ నాయక్, ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాస్, కోశాధికారి గుగులోత్ రమేష్,ముఖ్య సలహా దారులు బుర్ర సత్యనారాయణ మూర్తి గారు, సభ్యులు బూజురీ పూర్ణ చందర్, ఈ కార్యక్ర మానికి ప్రత్యేక ఆహ్వానితుడు , సట్టు యాకయ్య గారు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: