మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని- ప్రియాంక పర్యవేక్షణలో పెంట్లం గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ సవలం రాణి అధ్యక్షతన గ్రామ ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చిన దోమతెరలు పంపిణీ చేయడం జరిగింది. పంపిణీ కార్యక్రమంలో వైద్యాధికారులు మాట్లాడుతూ దోమతెరలు మలేరియా కేసులు నమోదు అయిన గ్రామాల్లో మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని, దీర్ఘకాలిక మన్నిక కలిగి, వేపనం పూయబడిన దోమతెరలు మూడు సంవత్సరాల వరకు ఉపయోగపడతాయని, ప్రజలు జాగ్రత్తగా వాటిని వాడుకుంటూ దోమల ద్వారా వచ్చే మలేరియా, డెంగ్యూ, బోదకాలు, మెదడువాపు, చికెన్ గున్యా వంటి వ్యాధుల బారిన పడకుండా రక్షణ పొందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి-పి రమేష్, వైద్యాధికారులు (హెచ్ఈఓ)- పోలెబోయిన కృష్ణయ్య, హెల్త్ సూపర్వైజర్-బి శారా రాణి, హెల్త్ అసిస్టెంట్ (హెచ్ఎ)-పొన్నారి, ఆశా కార్యకర్తలు ప్రియాంక, రాధా, శిరోమణి, నాగమ్మ, జ్యోతి, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: