CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విస్తృతంగా ఫెర్టిలైజర్ షాపులను తనిఖీలు నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారులు,పోలీసులు....

Share it:

 



చండ్రుగొండ మన్యం  టీవీ:                చండ్రుగొండ               మండలం  ఖరీఫ్ సీజన్ కావడంతో ఫెర్టిలైజర్ షాపుల ముందు రైతులతో సందడి వాతావరణం మొదలైంది, ఇదే అదునుగా భావించి వివిధ కంపెనీలకు చెందిన నకిలీ విత్తనాలు సరఫరా చేస్తూ రైతులను మోసం చేయాలని ఆలోచనతో కేటుగాళ్లు కంకణం కట్టుకున్నారు, నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నట్టు అక్కడక్కడ కొన్ని ఘటనలు జరుగుతూనే ఉన్నాయి,చండ్రుగొండ మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా ఫెర్టిలైజర్స్ షాపులను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు ,ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి

మాట్లాడుతూ: ఫెర్టిలైజర్స్ షాపులలో విత్తనాలు ,ఎరువులు సరఫరా చేస్తున్న కంపెనీలకు సరైన డాక్యుమెంట్స్ ఉన్నా


యా లేవా అని షాపు యజమానులు క్షుణ్నంగా పరిశీలించికోవాలని ఆ తర్వాతే దిగుమతి చేసుకోవాలని సరైన పత్రాలు లేని కంపెనీ విత్తనాలు సీజ్ చేయడం జరుగుతుందని అలాగే రైతులు కూడా విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని నకిలీ విత్తనాలు రైతులకు సరఫరా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు.ఈ తనిఖీలలో జూలూరుపాడు సిఐ ఎం నాగరాజు, యస్ ఐ బి రాజేష్ కుమార్,మండల వ్యవసాయ శాఖ అధికారి చటర్జీ మరియు పోలీస్ సిబ్బంది పాల్గున్నారు.

Share it:

Post A Comment: