CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా కంది విత్తనాల పంపిణీ

Share it:


మన్యం టీవీ, అశ్వాపురం:ఈ రోజు అనగా 18-06-2021 నాడు వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం ద్వారా తుమ్మల చెరువు మరియు చింతిర్యాల గ్రామాల్లో కంది విత్తనాలు ఎల్ ఆర్ జి 52 మరియు పి ఆర్ జి 176 రకాలను చిరు సంచులు పూర్తి ఉచితంగా రైతులకు అందజేయడం జరిగింది. తుమ్మల చెరువు రైతు వేదిక లో జరిగిన విత్తన పంపిణీ మరియు శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన ఏ డి ఎ మణుగూరు తాతారావు మాట్లాడుతూ ఈ విత్తనాలు ప్రత్తి పంటలో వరుసలలో గాని, ఒకే పంటగా గాని వేసుకోవచ్చు. పి ఆర్ జి 176 రకం పంటకాలం 135 రోజులు,దిగుబడి ఎకరానికి 4-5 క్విటాళ్లు కాగా తేలికపాటి మరియు వర్షాధార భూములకు అనుకూలం.

అదేవిధంగా ఎల్ ఆర్ జీ 52 రకం పంటకాలం 165 రోజులు మరియు దిగుబడి ఎకరానికి 5-6 క్విటాళ్లు కాగా బరువైన నేలలకు మరియు నీటి వసతి గల భూములకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సాయి శంతన్ కుమార్, తుమ్మల చెరువు ఎంపీటీసీ తాటి పూజిత , చింతిర్యాల సర్పంచ్ పాయం భద్రయ్య, ఉప సర్పంచ్ వెన్న అశోక్, ఏ ఈ ఓ సౌమ్య, నాగేశ్వరరావు మరియు స్థానిక రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: