👉నెరవేరని ఉద్యమ ఆకాంక్షలు,నీళ్లు,నిధులు, నియామకాలు ఎక్కడ
సాయుధ పోరాట స్ఫూర్తి తో ప్రజల తరుపున పోరాడుదాం
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జాతీయ జండా ఎగురావేసిన సిపిఐ మండల సహాయ కార్యదర్శి కొండపర్తి ప్రసాద్
మన్యం టీవీ అశ్వాపురం: సాయుధ పోరాట స్పూర్తితో సామజిక తెలంగాణ సాధనకు ప్రజా సమస్య లే ఎజెండా గా ప్రజల తరుపున పోరాడాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు పార్టీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.బుధవారం ఉదయం మొండికుంట సిపిఐ కార్యాలయ ఆవరణలో సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిది గా హాజరై ప్రసంగించారు. మువ్వన్నెల జాతీయ జండా ను సిపిఐ మండల సహాయ కార్యదర్శి కొండపర్తి ప్రసాద్ ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేర్పుల మల్లికార్జున్,సిపిఐ మండల సహాయ కార్యదర్శి దంతాల జగదీశ్,నెల్లిపాక సొసైటీ వైస్ చైర్మన్ కమటం సురేష్, డైరెక్టర్ కోడి వెంకన్న,సిపిఐ ప్రజా సంఘాల నాయకులు సాదం యాదగిరి రెడ్డి,కొల్లు ఆశ,దండి నాగేశ్వరావు, దుర్గ ప్రసాద్,అంబటికర్ర శ్రీను,కోసూరి అంజయ్య, బుర్రి యాదయ్య, తదితరులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు.
Post A Comment: