మన్యం టీవీ అశ్వాపురం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ఈ మండలం వ్యవసాయ ఆధారిత మండలం కాబట్టి మండలంలో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లు అయితే క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ కేసులు కూడా అమలు చేస్తామని అశ్వాపురం సీఐ సట్ల రాజు తెలిపారు.నకిలీ విత్తనాల బెడద ను అరికట్టేందుకు అందరూ సహకరించాలని తెలిపారు.రైతులు వ్యవసాయ శాఖ ధ్రువీకరించిన వ్యాపారుల వద్ద నే నాణ్యమైన విత్తనాలు ఎరువులు విక్రయించాలని రైతులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కొత్త వ్యక్తుల నుంచి ఎరువులు విత్తనాలు కొని మోసపోవద్దని రైతులకు తీయజేశారు.మండలంలో ఉన్న ఎరువులు పురుగు మందుల దుకాణాల్లో తప్పకుండా విత్తనాలు ఎక్కడ నుండి దిగుమతి చేసుకున్నారో ఆయా కంపెనీల వివరాలు క్షుణ్ణంగా స్టాక్ రిజిస్టర్ లో ఉంచాలని వ్యాపారులకు సీఐ సట్ల రాజు సూచించారు.
Post A Comment: