20 సంవత్సరాల నుండి మానసిక వ్యాధితో బాదపడుతున్న
తనకు తల్లే అన్ని సపర్యలు...
దయ గల దాతలు ఆదుకోవాలని తల్లి ఆవేదన
మన్యం మనుగడ మంగపేట
వారిది రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం. 20 సంవత్సరాల నుండి మానసిక వ్యాధితో బాధపడుతూ కుటుంబానికి భారమైన కుమారుడు. సంవత్సరం క్రితం అనారోగ్యంతో మరణించిన తండ్రి. ప్రస్తుతం ఆ కుటుంబ పరిస్థితి అగమ్యగోచరం.బ్రతుకు బండిని నడపలేక బాధపడుతున్న ఓ తల్లి జీవితంపై
మన్యం మనుగడ అందిస్తున్న ప్రత్యేక కథనం.
మంగపేట మండలంలోని కొత్త మల్లూరు గ్రామానికి చెందిన బట్ట చిననరసింహ- మాణిక్యం దంపతుల రెండవ సంతానం బట్ట రాములు. పుట్టుకతో మానసిక వ్యాధిగ్రస్తునిగా జన్మించి తల్లిదండ్రులకు భారం అయినాడు. తండ్రి మరణించకముందు దగ్గరలోని పాఠశాలలో పని చేసుకుని వచ్చి కొడుకు ఆలనాపాలనా చూస్తూ ఉండేవాడు. దురదృష్టవశాత్తు జ్వరం కారణంగా తండ్రి సంవత్సరం క్రితం మరణించినాడు. ప్రతిరోజూ కూలి పనులకు వెళ్లే తల్లి భర్త మరణించడంతో కొడుకు అన్నీ తానై సపర్యలు చేస్తోంది. ఆర్థికభారం కారణంగా సరైన ఆహారాన్ని తినలేక, మానసిక వ్యాధితో బాధపడుతున్న కొడుకుకి అందించలేక ఆతల్లి తల్లడిల్లి పోతుంది. పెద్ద కొడుకు ఒక చిన్న చికెన్ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని
నడిపిస్తున్నాడు. వచ్చే డబ్బులు ఇంటి ఖర్చులకి చాలక ఉపవాసాలు ఉన్న రోజులు ఎన్నో. కొడుకు పరిస్థితి చూసి తల్లి మానసికంగా కుంగిపోతుంది. పెద్ద కొడుకు పనిచేస్తేనే ఇంట్లో నడిచే పరిస్థితి అంతంత మాత్రమని, ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆర్థిక పరిస్థితి బాగాలేక నిస్సహాయ స్థితిలో ఉన్నామని, దయ గల దాతలు ఆర్థికంగా ఆదుకోవాలని రాములు తల్లి అయిన మాణిక్యం వేడుకుంటుంది.
మన్యం టీవీ మన్యం మనుగడ ల ప్రతినిధి శంకర్ మైపా.
Post A Comment: