మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన పల్ల మణికంఠ తండ్రి శ్రీనివాస్ కు మంజూరైన 50000 వేల రూపాయల విలువ గల సీఎం సహాయనిధి చెక్కును ములుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్ జగదీష్ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అందజేశారు. అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ పేదల పెన్నిధి గా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం అమలవుతుందని అంతేకాకుండా కరోనా వలన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారంతో సతమతమవుతున్న అప్పటికీ నిరుపేదలకు ఆర్థికంగా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి గారికి ఏటూరు నాగారం మండల పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు ఎండి వలియాబీ, ఏటూరు నాగారం పిఎసిఎస్ చైర్మన్ కూనూరు అశోక్ గౌడ్, రామన్నగూడెం సర్పంచ్ దొడ్డ కృష్ణ, ఎంపీటీసీ అల్లి సుమలత శ్రీనివాస్, తెరాస సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, సప్పిడి రామనర్సయ్య, మండల ప్రధాన కార్యదర్శి సర్దార్ పాషా, మండల ఉపాధ్యక్షులు కొమిరి రమేష్,యూత్ మండల అధ్యక్షులు కొండాయి చిన్ని,నాగరాజు, కోటయ్య, శ్రీనివాస్ బిక్షపతి, సత్యనారాయణ, మహేష్, ధనపునేని కిరణ్ కుమార్, కుమ్మరి చంద్రబాబు, జాడి బోజ రావు, చెన్న బిక్షపతి, కందగట్ల శ్రీనివాస్, కాళ్ల రామకృష్ణ, మెరుగు సత్యం, శంకర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: