మన్యం టీవీ పాల్వంచ :-
ఈరోజు"సత్యం స్వచ్ఛంద సంస్థ" ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు పొన్నెకంటి సంజీవరాజు జమాతే ఇస్లామిక్ హింద్ సంస్ధ వారికి వాటర్ బాటిళ్లను వితరణ చేయడం జరిగినది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమాతే ఇస్లామి హింద్ వారు నిర్వహిస్తున్న సేవలు...
ముఖ్యంగా కోవిడ్ బారిన పడి మృతి చెందిన వారిని కుటుంబ సభ్యులే అంతిమ సంస్కారానికి ముందుకు రాని పరిస్థితుల్లో ,వారికి మేమున్నాం అంటూ ముందుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలువడం గర్వకారణం అన్నారు.వారు ఎండలో కనీసం తాగుటకు నీరు కూడా లేని సందర్భాన్ని స్వయంగా చూసి త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ప్రతిఒక్కరూ వీరు అందిస్తున్న సేవలను గుర్తించి ప్రోత్సహించాలని,భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా ప్రజలకు అందించాలని వారు తెలిపారు,ఈ కార్యక్రమంలో టి.ఎ.9 న్యూస్ ప్రతినిధి ఎం.ఎ.మజీద్,జమాతే ఇస్లామి హింద్ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ సమద్,ఎం.డి.ఫయీమ్, సత్తార్,అన్వర్,శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: