మన్యం టీవీ మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండలం,కూనవరం టిఆర్ఎస్ నాయకులు ఉప్పుతల రామారావు బైక్ స్కిడ్ అయి పడిపోయి గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు గురువారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.అనంతరం వైద్య ఖర్చుల నిమిత్తం రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు నుండి రూ.20 వేల రూపాయల చెక్కును అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ పొశం నర్సింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, ఎంపీటీసీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,టిఆర్ఎస్ పార్టీ నాయకులు ముద్దంగుల కృష్ణ,ప్రజా ప్రతినిధులు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: