మన్యం టీవీ మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మణుగూరు పోలీస్ స్టేషన్ లో బుధవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలును సిఐ భాను ప్రకాష్ నిర్వహించారు.ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం సిఐ భాను ప్రకాష్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణం లో అందరూ భాగస్వాములు కావాలన్నారు.కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు నరేష్,పురుషోత్తం, మరియు పొలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: