మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి ఏరియా ఎస్సి,ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 140/2018 వారి ఆధ్వర్యంలో రేకులగండి, శివారు సర్వాయి గుంపు వలస గోత్తి కోయలకు సోమవారం నాడు 75 కిలోల బియ్యాన్ని దుస్తులను వితరణగా అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సంఘం ఏరియా ఉపాధ్యక్షులు ఖాజీపేట కృష్ణ మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో సింగరేణి ఎస్సి,ఎస్టీ ఉద్యోగుల సంక్షేమానికి ఒకవైపు పాటు పడుతూనే,రెండోవైపు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,తమకు సహకరిస్తున్న సభ్యులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆదివాసీలు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.కమిటీ సభ్యులు ఎం.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామస్తులు అందరికీ మాస్కులు అందజేశారు.అనంతరం చిన్నారులందరికీ బిస్కెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాజీపేట. కృష్ణ,ఈ.రాజేష్,శనిగరపు.కుమారస్వామి,ఎం.వెంకటేశ్వర్లు,పి.గంగాధర్,డి.భాస్కర్,కే.రాజు,గూగులోత్. దశరథ్,భానోత్ జగన్ నాయక్,సింగరేణి సేవా సమితి సభ్యులు నాసర్ పా షా,మంగీలాల్,గ్రామస్తులు చుక్కయ్య,దేవయ్య రేవతి,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: