CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అటవీ భూమిలో తవ్వకాలు చేస్తున్న జేసిబి, యజమానిపై కేసు

Share it:

 


అటవీ హక్కుల ను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

ఏడూళ్ల బయ్యారం ఫారెస్ట్ రేంజ్ అధికారి తేజస్విని


మన్యం మనుగడ, పినపాక: పినపాక మండలంలోని 

దుగినే పల్లి రిజర్వుడు అటవీ ప్రాంతంలో త్రవ్వకాలు చేస్తున్న జెసిబి ని అదుపులోకి తీసుకున్న ఫారెస్టు అధికారులు. వివరాల్లోకి వెళితే దుగినేపల్లి రిజర్వ్ ఫారెస్ట్ కు చెందిన సున్నం వారి గుంపు దగ్గరలో జెసిబి సహాయంతో అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నారని తెలుసుకున్న ఫారెస్ట్ రేంజ్ అధికారి తేజస్విని, ఫారెస్ట్ సిబ్బంది ఆదివారం రోజు సుమారు పది గంటల ప్రాంతంలో అక్కడకు వెళ్ళగా జానంపేట గ్రామానికి చెందిన పోలిక వెంకన్న చౌదరి కి చెందిన, జెసిబి తవ్వకాలు జరపడాన్ని గమనించిన ఫారెస్టు అధికారులు జెసిబి ని స్వాధీనపరచుకొని, యజమాని, జెసిబి పై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారి తేజస్విని మాట్లాడుతూ, అటవీ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు తప్పవని హెచ్చరించారు.


ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు వేణు, నాగేంద్రబాబు, రాంబాబు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: