CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పడమట నర్సాపురం లో కరోనా పరీక్షలు...

Share it:

 




మన్యం టీవీ : జూలూరుపాడు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

జూలూరుపాడు మండలం లోని పడమటి నర్సాపురం గ్రామపంచాయతీలో  ఇటీవల ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ కేంద్రం వద్ద సోమవారం కరోనా మొబైల్ టెస్టింగ్ సంచార వాహనం ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 100  మందికి పరీక్షలు చేయగా 24 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది వీరందరికీ మెడికల్ కిట్లను అందజేశారు. తగు జాగ్రత్తలు సూచనలను వైద్యులు సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు 17 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరిగ కూడదని కోరారు. ఇతరులకు వ్యాధి సోకకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో  గ్రామపంచాయతీ సర్పంచ్ కట్రం మోహన్ రావు, సెక్రెటరీ తిరుపతి, వార్డు సభ్యులు కాజా రమేష్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, హరీష్, లేళ్ళ  గోపాలరెడ్డి, శ్రీకాంత్, వైద్యులు డాక్టర్ వీరబాబు, సిహెచ్ ఓ వెంకటేశ్వర్లు, హెచ్ ఎ (ఎఫ్ )దిలక్ష్మి ,హెచ్  ఎ (ఎం )కృష్ణ ,హెచ్ ఎ (ఎఫ్) పరమేశ్వరి, ఆరోగ్యమిత్ర రాధాకృష్ణ ,ఆశా వర్కర్లు జయమ్మ, రవణ, మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది, పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: