CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ రేగా కాళిక

Share it:

 


కరకగూడెం మండలంలోని కరకగూడెం(చిరుమళ్ళ) ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఐసోలేషన్ కేంద్రాన్ని కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక చేతులమీదుగా ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎంపీపీ రేగా కాళిక మాట్లాడుతూ...కరోనా కష్టకాలంలో కొవిడ్ బాధితులు ఆక్సిజన్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సివస్తోందని,అందుకే పేద ప్రజల రక్షణ కోసం ఆక్సిజన్ సదుపాయంతో పాటు,కేంద్రంలో 10 పడకల కరోనా బాధితులకు అందుబాటులో ఏర్పాటు చేసినట్లు వివరించారు.ప్రజాప్రతినిధులు,అధికారులు.. వైద్య సిబ్బందికి అన్నివేళలా సహకరిస్తారని ఆమె హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కొమరం కాంతారావు,చిరుమళ్ళ సర్పంచ్ పాయం నర్సింహారావు,ఎంపీడీవో శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: