మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం, ఎర్రగుంట (పెద్దిరెడ్డిగూడెం) గ్రామంలోని జడ్పిఎస్ఎస్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదివిన విద్యార్థినిలు, జాతీయ మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. గుంపెన గ్రామ పంచాయితీ, హెచ్ కాలనీ కు చెందిన అంగడాల అనురాధ, కొక్కెరగడ్డ గోపిక అను విద్యార్థినిలు. 21-ఫిబ్రవరి-2021న జరిగిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్(ఎన్ఎంఎంఎస్) ఎగ్జామ్ లో తమ ప్రతిభను చాటి స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. ఎన్.ఎం.ఎం.ఎస్ పథకం తరుపున వీరి ఉన్నత చదువులకు ఒక్కొక్కరికి సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున తొమ్మిదో తరగతి, పదవ తరగతి, ఇంటర్మీడియట్ వరకు ఉపకార వేతనాలు అందనున్నాయి. గోపిక, అనురాధ లను వారి వారి తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితర సిబ్బంది, గ్రామస్తులు ఆనందం వ్యక్తపరుస్తూ, అభినందించారు.
Post A Comment: