CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డి సీ పి రక్షిత పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్ డిమాండ్

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ప్రజల ఆరాధ్య నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా నేత ఎమ్మెల్యే సీతక్క వారి అమ్మ హైదరాబాద్ హాస్పిటల్ లో అత్యవసర పరిస్థితి లో ఉంటే, జిల్లా కలెక్టర్ అనుమతి తో హైదరాబాద్ బయలుదేరిన బంధువుల కారును అడ్డుకున్న పోలీస్ అధికారి మల్కాజిగిరి డిసిపి రక్షిత పై శాఖాపరమైన చర్యలు తీసుకొని పోలీస్ శాఖ పై ఉన్న నమ్మకాన్ని తెలంగాణ ప్రజల్లో నిలబెట్టుకోవాలని సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తాడ్వాయి మండలం ఊరట్టం లో చేర్ప రవీందర్ మాట్లాడుతూ ఆపద కాలంలో ఉన్న ఒక ఎమ్మెల్యే కి పోలీస్ అధికారి అత్యుత్సాహంతో దురుసుగా ప్రవర్తించిన తీరు అత్యంత నీచంగా ఉంటే సామాన్య ప్రజల మాటేమిటని విమర్శించారు. ప్రజల ప్రాణాలను కాపాడటం లో ముందు వరుసలో ఉండి ప్రజల్లో నమ్మకం పెంచే రక్షణ శాఖలో విధులు నిర్వహిస్తూ ఎమ్మెల్యే సీతక్క వారి తల్లి ప్రాణాలను కాపాడటానికి కుటుంబ సభ్యులు వెళ్లే వాహనానికి లాక్ డౌన్ నియమాల ప్రకారం అన్ని రకాల అనుమతులు ఉన్నా కూడా కరుడుగట్టిన తనంతో సమాజం తలదించుకునేలా తన ప్రవర్తనతో అధికార దుర్వినియోగానికి పాల్పడిన డి సీ.పి రక్షిత పై పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకొని సామాన్య ప్రజల పక్షాన నిలబడాలని, చేర్ప రవీందర్ కోరారు.అంతే కాకుండా మళ్ళీ మళ్ళీ ఇలాంటి వి పునరావృతం కాకుండా చూడాలి అని, తెరాస పరిపాలన లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, అని అన్నారు. ములుగు జిల్లా లో కరోనా సమయంలో గ్రామాగ్రామాన్ని ఎమ్మెల్యే సీతక్క తిరిగి సామాన్య ప్రజల ను ఆదుకుంది అని, ప్రతి కరోనా బాధితున్ని కలిసి బాగోగులు తెలుసుకొని దైర్యం చెప్పింది అని, అంతే కాకుండా చెనిపోయిన ప్రతి కుటుంబం ని పరామర్శించిన ఎమ్మెల్యే దేశం లో సీతక్క ఒక్కరే అని, అలాంటి మా నాయకురాలి కి ఇబ్బంది జరుగుతే మా ములుగు జిల్లా ప్రజలం చూస్తూ ఉరుకోము అని, తెరాస ప్రభుత్వం ని హెచ్చరించారు.

Share it:

TELANGANA

Post A Comment: