రూ.70 లక్షల రూపాయల తో అభివృద్ధికి శ్రీకారం చుట్టిన విప్,పినపాక ఎమ్మెల్యే రేగా. కాంతారావు
మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణ ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం రూ.70 లక్షల రూపాయల తో మణుగూరు బస్టాండ్ అభివృద్ధికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు శ్రీకారం చుట్టారు.దీనితో త్వరలో మారనున్న మణుగూరు సురక్ష బస్టాండ్ రూపురేఖలు.శుక్రవారం పట్టణంలోని సురక్ష బస్టాండ్ ను,ప్రయాణ ప్రాంగణాన్ని విప్ రేగా కాంతారావు అధికారులతో కలసి పరిశీలించారు.అనంతరం తగు సూచనలు,సలహాలు సూచించారు.రూ.70 లక్షల వ్యయంతో ఆధునీకరించుట కొరకు అవసరమైన ప్రణాళికలు రూపొందించ వలసిందిగా మణుగూరు మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగప్రసాద్,ఏ ఈ సత్య,టౌన్ ప్లానింగ్ అధికారులు,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,పార్టీ కార్యకర్తలు,యువజన నాయకులు,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: