CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పౌరసంబంధాల శాఖ అధికారి పద్మపై కలెక్టర్‌ పమేలా కొరడా ఝుళిపించారు

Share it:

 


యాదాద్రి(నల్లగొండ): విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి పద్మపై కలెక్టర్‌ పమేలా కొరడా ఝుళిపించారు. హెచ్చరిస్తున్నా అలసత్వం వీడకపోవడంతో గురువారం ఆమెను సమాచార శాఖ (ఐఆండ్‌ పీఆర్‌) కమిషనర్‌ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు, ఉద్యోగుల పనితీరుపై కలెక్టర్‌ బాధ్యతలు తీసుకున్న తొలిరోజునుంచే సీరియస్‌గా దృష్టి సారించారు. వారం రోజులు గడుస్తున్నా కొందరిలో  మార్పు రాకపోవడాన్ని గుర్తించారు. ఇందులో భాగంగా డీపీఆర్‌ఓపై తొలి వేటు వేశారు.   


జిల్లా యంత్రాంగంలో దడ

జిల్లాలో పని చేస్తున్న ఉన్నతాధికారుల నుంచి అటెండర్ల వరకు చాలామంది స్థానికంగా నివాసం ఉండ డం లేదు. ఇతర జిల్లాల నుంచి రోజూ రాకపోకలు సాగిస్తుంటారు. కలెక్టర్‌ బాధ్యతలు చేపట్టాగానే ఈ విషయంపై దృష్టి సారించారు. తొలిరోజే అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండాలంటే స్థానికంగా నివాసం ఉండాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్డీఓలు, ఇతర శాఖల జిల్లా అధికారులు, నాల్గో తరగతి ఉద్యోగుల్లో స్థానికంగా నివాసం ఉండనివారి వివరాలనుసేకరించారు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి వచ్చిపోతున్న అధికా రులను గుర్తించారు. కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండలస్థాయి అధికారులు, సిబ్బంది సమయపాల న పాటించకుండా రాకపోకలు సాగించడం, ప్రజల కు అందుబాటులో ఉండకపోవడంతో చక్కదిద్దాలని నిర్ణయించినట్లు సమాచారం. ఉదయం 12గంటల వరకు విధులకు హాజరుకాకపోవడం, మధ్యాహ్నం 3 కాగానే వెళ్లిపోయే వారందరి వివరాలను సేకరించినట్లు తెలిసింది.

Share it:

TELANGANA

Post A Comment: