గుండాల జూన్ 11 (మన్యం టీవీ) మండలం పరిధిలోని లింగగూడెం గ్రామం వారం రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరగడంతో గ్రామంలో కరోనా బారిన పడినవారు ఎక్కువగా ఉన్నారు. మరికొంతమంది కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఈ లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. కరోనా కట్టడిలో కి రావాలంటే సంపూర్ణ లాక్ డౌన్ ఒక్కటే మార్గమని వారు అన్నారు. వేరే గ్రామస్తులు ఎవరు లింగగూడెం గ్రామంలోకి రావద్దని విజ్ఞప్తి చేశారు
Post A Comment: