CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో వరి విత్తనాల పంపిణీ: అధ్యక్షులు కుర్రి. నాగేశ్వరరావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వరి విత్తనాలను పిఎసిఎస్ అధ్యక్షులు కుర్రి. నాగేశ్వరరావు,జడ్పిటిసి పొశం.నరసింహారావు,ఎంపీపీ కారం.విజయ కుమారి, అగ్రికల్చర్ ఏ డి తాతారావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఖరీఫ్ సీజన్ కు రైతులకు కావాల్సిన విత్తనాలను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది అన్నారు.దళారుల దగ్గర రైతులు మోసపోవద్దు అనే ఉద్దేశంతో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులకు విత్తనాలు అందుబాటులోకి తెచ్చారని అని తెలిపారు. సొసైటీ వారి సేవలు రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయని జడ్పిటిసి పొశం. నరసింహారావు రైతులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బచ్చల భారతి,కారం. ముత్తయ్య,ఉప సర్పంచ్ పుచ్చకాయల శంకర్, ప్రభుదాస్,తంత్ర పల్లి.కృష్ణ, ముద్దంగుల కృష్ణ,శేఖర్, సంఘం సీఈఓ జ్ఞాన దాసు,రాఘవులు,శివ,సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: