శాంతి భద్రతల పర్యవేక్షణలో ఎస్ ఐ జితేందర్ నిమగ్నం.
మన్యం టీవీ,బూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో
ఎస్ ఐ జితేందర్ ఛార్జ్ తీసుకున్న రోజు నుండే మండలం మొత్తం ప్రశాంతంగా ఉండాలనే ఆలోచన,ధేయంగా డ్యూటీని నాటి నుండి నేటి వరకు చాలా పటిష్టంగా చేస్తున్నారు.ముఖ్యంగా శాంతి భద్రతల పర్యవేక్షణను మరింత పటిష్ఠం చేసేందుకు ఆయన కృత నిశ్చయంతో ఉన్నాడని మనం పై చిత్రం ఆధారంగా చెప్పుకోవచ్చు.మండలం లోని కృష్ణసాగర్ సమీపంలోని ఓ చెరువు వద్ద గొడవ జరుగుతున్నదని తెలుసుకున్న స్థానిక ఎస్ ఐ జితేందర్ ఆగమేఘాల్లో అక్కడికి చేరుకొని గోడవని అదుపు చేశారు. అక్కడి నుండి ఎస్ ఐ వెళ్లి పోగానే మరల గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయన్న విషయం ఎస్ ఐ జితేంద్ర దృష్టికి వచ్చింది. దీంతో ఎస్ ఐ జితేందర్ అక్కడ ఎటువంటి గొడవలు జరగకూడదని ఆయన అక్కడే ఉన్నారు. మధ్యాహ్నం భోజనం సైతం అక్కడే తినడం పలువురి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది.ఇలాంటి పోలీస్ మండలానికి ఒకరు ఉంటే రాష్ట్రం సైతం ప్రశాంతంగా ఉంటుంది అని మండలంలో ప్రజలు ఎస్సై సేవలను అభినందిస్తున్నారు.
Post A Comment: