గుండాల ( మన్యం టీవీ) మండలం పరిధిలోని లక్ష్మీదేవి పల్లి గ్రామంలో ఆంజనేయ విగ్రహ ప్రతిష్టను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమానికి గ్రామస్తులతో పాటు బంధువులు పెద్ద మొత్తంలో హాజరయ్యారు. ప్రత్యేక పూజలు డప్పు వాయిద్యాలతో ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మాజీ ఎంపీపీ చాట్ల పద్మ మాట్లాడుతూ ఆంజనేయ విగ్రహ ప్రతిష్టను పండగ వాతావరణంలో నిర్వహించామన్నారు గ్రామస్తులతో పాటు ఆడబిడ్డలు బంధువులు హాజరయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో కుంజ సత్యనారాయణ , పడి గా వెంకన్న , పెనక మల్లేష్ , జగ్గయ్య , భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: