*ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పని చేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణం.
*కరోనా నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ సేవలందిస్తున్న జర్నలిస్టులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
*కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో జర్నలిస్టు మిత్రులకు నిత్యవసర సరుకులు మాస్కులు శానిటైజర్ అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ములుగు జిల్లాలోని 65 మంది జర్నలిస్టు సోదరులకు నిత్యవసర సరుకులు, మాస్కులు, శానిటైజర్ లు అందజేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే కరోనా తో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి, కిసాన్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేంద్ర గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రవి చందర్, మండల అధ్యక్షులు చెన్నోజు సూర్యనారాయణ, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండి అజ్జు,వజ్జా సారయ్య, వెంకటేశ్వర్లు గంగారాం, శంకర్ బిక్షపతి నాగరాజు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: