👉ప్రమోషన్ పై మణుగూరు కార్మిక శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన నాగరాజు
👉మర్యాద పూర్వకంగా కలిసిన ఏఐటీయూసీ నాయకులు
👉 రిజిస్టర్ గుర్తింపు కార్మిక సంగం సభ్యత్వం ఉంటేనే అవకాశం ఇవ్వాలి
👉అనర్హులకు అవకాశం ఇవ్వొద్దు
👉కార్మిక శాఖ లో అనాదికరా ఏజెంట్ వ్యవస్థ ను రద్దు చెయ్యాలి
👉గుర్తింపు కార్మిక సంగం సభ్యత్వం ఉంటేనే కార్మికునిగా రిజిస్ట్రేషన్ చెయ్యాలి
👉నూతన కార్మిక శాఖ అధికారి నాగరాజు కు ఏఐటీయూసీ వినతి
మన్యం టీవీ మణుగూరు:
అశ్వాపురం,మణుగూరు కార్మిక శాఖ అధికారిగా బాధ్యతలు స్వేకరించిన నాగరాజు ను సోమవారం మధ్యాహ్నం ఏఐటీయూసీ అనుబంధ ప్రజా సంఘాల నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రమోషన్ పై వచ్చిన నాగరాజు ను,నాయకులు శాలువాలు కప్పి,పుష్ప గుచ్చం అందించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేర్పుల మల్లికార్జున్,నాయకులు సీతారాములు,సురేందరరెడ్డి,సర్వ కృష్ణ,నర్సింహారావు, విశ్వనాధం,రామాచారి, ఏఐటీయూసీ అశ్వాపురం మండల అధ్యక్షులు రాయపూడి రాజేష్, నాయకులు ఉపేంద్రచారీ, జగన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: