మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్కను కలిసి భూ సమస్యలపై వినతి పత్రం అందించిన చల్వాయి గ్రామ రైతులు ఈసందర్భంగా సీతక్క మాట్లాడుతూ గత 40 యేండ్ల నుండి సాగు చేస్తున్నా భూములపై ఫారెస్ట్ అధికారులు అడ్డు పడుతున్నారు, అని గత ప్రభుత్వాలు పట్టాలు ఇస్తే ఈ ప్రభుత్వం హరిత హరం పేరుతో లాక్కునే కుట్ర చేస్తుందని అన్నారు. ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని ఖాస్తులో ఉన్న ప్రతి ఒక్కరి పట్టాలు ఇవ్వాలి అని ఫారెస్ట్ జిల్లా అధికారికి మరియు రేంజర్ కు ఫోన్ ద్వారా వివరించడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో చల్వాయి గ్రామ రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: