మన్యంటీవీ,అశ్వారావుపేట:
అశ్వారావుపేట చేగువేరా సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవిడ్ బాధిత కుటుంబాలకు, నిరాశ్రయులకు భోజనం పంపిణి చేయడం జరిగింది. పట్టణం లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుండడంతో మనసున్న మారాజులు మేమున్నామని ముందుకువస్తున్నారు. పేదవారికి సహాయసహకారాలు మరెన్నో అందిస్తున్నారు ఇదే క్రమంలో అశ్వారావుపేట మండలంలో అతితక్కువ కాలంలోనే అనేకసేవలు అందిచి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకొన్నటువంటి చేగువేరా ఫౌండేషన్ యువత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చిన్నం శెట్టి బజారులో గల ఒక కుటుంబం మొత్తానికి కరోనా సోకడంతో వారిలో ఒకరు మరణించారు ఇది తెలుసుకున్న సేవ సభ్యులు వారికీ భోజనం ఏర్పాటు చేయడమే కాకుండా వారికీ ఏ అవసరమైన మాకు ఫోన్ చేయమని తెలియజేసారు. ఇలాంటి యువతను చూసి స్థానికేతరులు ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమం లో సీహెచ్ అశోక్ బాబు, బి హరీష్, అహల్య, ప్రేమ్, సాయితేజ, వేముల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: