మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం మొండికుంట లోని మాజీ ఎంపీపీ టిఆర్ఎస్ నాయకులు కొల్లు మల్లారెడ్డి పెద్ద కుమారుడు జగదీష్ రెడ్డి దశదిన కార్యక్రమానికి హాజరై చిత్రపటానికి నివాళులర్పించి, మల్లా రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో డీ సీ సీ బీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, ఎంపీపీ ముత్తినేని సుజాత, టీ ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, టీ ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: