ప్రత్యేక అధికారులుగా పలు ప్రభుత్వ శాఖ విభాగం అధికారులు
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీపీ గుమ్మడి గాంధీ
మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు నాలుగోవ పల్లె ప్రగతి పాదయాత్రను దిగ్విజయంగా ముగించాయి. పాదయాత్రలో భాగంగా పంచాయతీలలో ఉన్న మురికి గుంటలు,కాలువలను పాడైపోయిన భావులను,కచ్చా కాలువలను గుర్తించారు.ముఖ్యఅతిథిగా సీతంపేట, గడ్డం పల్లి పంచాయతీలో ఎంపీపీ గుమ్మడి గాంధీ పర్యటించి ఆ పంచాయతీలో ఉన్న సమస్యలను గుర్తించారు. పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల సాకారాన్ని నిజం చేయాలని, పచ్చని తోరణాలతో పల్లెలు ఆహ్వానం పలకాలని, పచ్చని పల్లె లే దేశానికి పట్టుకొమ్మలు అని, గ్రామపంచాయతీలో ఉన్న సమస్యలను పల్లె ప్రగతిలో భాగంగా పరిష్కరించుకోవాలని ఆయన సందేశాన్ని ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,ఉప సర్పంచులు,వార్డు మెంబర్లు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: