మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని గ్రామ పంచాయతీల లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనులను మరియు పల్లె పకృతి వనాలను,జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,ఎంపీపీ కారం.విజయకుమారి సనదర్శించారు.ప్రతి పంచాయతిని అత్యంత సుందరంగా తీర్చి దిద్దాలని అన్నారు.పల్లె ప్రగతి పనులను పరిశీలించారు.వర్ష కాలం లో వచ్చే సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని,తగు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. సమితి సింగారం పంచాయతీ పరిధిలోని వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ పనులను పరిశీలించారు.అనంతరం పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం విజయ కుమారి, సమితి సింగారం సర్పంచ్ బచ్చల బారతి,ఉప సర్పంచ్ పుచ్చకాయల శంకర్, స్పెషల్ ఆఫీసర్ శీరిష,ఎంపీడీవో వీరబాబు,ఎంపీఓ పి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: