మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదర్శ నగర్ లో రోడ్డుకు ఇరువైపులా చెత్తను తీసి వేసే కార్యక్రమాన్ని జడ్పిటిసి పొశం. నరసింహారావు ప్రారంభించారు.ఈ సందర్భంగా స్థానికులకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,రోగాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రమాదేవి,ఎంపీపీ కారం విజయ కుమారి, ఎంపీడీవో వీరబాబు, ఎంపీఓ పి.వెంకటేశ్వర్లు, సర్పంచ్ బచ్చల భారతి,ఉప సర్పంచ్ పుచ్చకాయల. శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: