తెలంగాణ రైతు బంధు పంట పెట్టుబడి మద్దతు పథకం ఎంపీపీ రేగా కాళికా, మండల అద్యక్షులు రావుల సోమయ్య గౌడ్
కరకగూడెం మండలంలోని భట్టుపల్లి గ్రామపంచాయతి పరిధిలో రైతు వేదిక నందు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటానికి కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక,పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య పాలభిషేకం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీపీ,పార్టీ అధ్యక్షులు రేగా కాళిక,రావుల సోమయ్య మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంకల్పంతో కరోనా కష్టకాలంలో కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్న రైతు బంధు నిధులు రైతు ఖాతాల్లో నగదు జమ చేయడం అన్నదాతలకు కేసీఆర్ ఆత్మ బంధువు అని కొనియాడారు.
అనంతరం భట్టుపల్లి గ్రామపంచాయతి పరిధిలో రైతు వేదిక ప్రాంగణంలో కేసీఆర్ చిత్రపటానికి రైతులు,ప్రజాప్రతినిధులతో పాలభిషేకం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంపెళ్ళి పెద్ద రామలింగం,అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,యలిపెద్ది శ్రీనువాసు రెడ్డి,నేతాజీ,రేగా సత్యనారాయణ,ఎల్లా గౌడ్,ముద్దం సతీష్,గౌరి లింగయ్య,భాస్కర్,లక్కా శ్రీనువాసు,కొలగాని పాపారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: