మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా. కాంతారావు ఆదేశానుసారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి,రైతాంగానికి మద్దతునిస్తు,రైతు బంధు పధకం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ దృడచిత్తంతో రాష్ట్రం లోని 63.25 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రూ.7509 కోట్ల రూపాయలు సహాయం జమ కానున్నాయి.ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి పథకాన్ని వరసగా ఏడోసారి, కరోన విపత్కర పరిస్థితుల లో కూడా రైతాంగాన్నికి రైతు బంధు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రైతాంగాని కి శుభాకాంక్షలు తెలుపుతూ,మన రైతు భాందవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ పొశం నర్సింహారావు,ఎంపీపీ కారం.విజయకుమారి, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు,వైస్ ఛైర్మన్ దొండేటి.రామోహన్ రావు, వైస్ ఎంపీపీ కె.వి.రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపీటీసీల ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు,ఎంపీటీసలు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,సర్పంచ్ లు, మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షుడు అడపా. అప్పారావు,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్, పినపాక నియోజకవర్గ మీడియా ఇంఛార్జి యాదగిరి గౌడ్,ఉప సర్పంచ్లు,సొసైటీ డైరెక్టర్ మామిడిపల్లి. సీతారాములు,మండల యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,టిఆర్ఎస్ నాయకులు,ఎడ్ల శ్రీను, ముద్దంగుల కృష్ణ,వెంకట్ రెడ్డి,హరిప్రసాద్,హబీబ్, నైనారపు.నాగేశ్వరరావు, ఉప్పుతల.రామారావు,గణేష్,తాత రమణ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: